యాద‌గిరిగుట్ట ఆల‌యంలో స్పీక‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు

యాదగిరిగుట్టలోని ప్ర‌సిద్ధ‌ లక్ష్మీ నరసింహస్వామి అల‌యాన్ని  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమ‌వారం సంద‌ర్శించారు.ఈ సంద‌ర్భంగా  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోదా కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. అంత‌కుముందు స్పీక‌ర్‌కు అర్చ‌కులు, ఆలయ ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *