రాష్ట్ర రాజకీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…








