శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంది

– ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ
– చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్

న్యూదిల్లీ, జులై 27: నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియు తంగా నిరసన తెలిపే హక్కును కల్పిస్తుందని, కేవలం నిరసన వ్యక్తం చేస్తున్నారనే కారణంతో పోలీసు బలప్రయోగానికి పాల్పడకూడదని స్పష్టం చేసింది. ఈనెల‌ 20న చలో సంసద్ కార్యక్రమంలో భాగంగా నీట్ పేపర్ లీక్ కేసుపై న్యాయం కోరుతూ విద్యార్థులు నిర్వహించిన నిరసన సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ హక్కులపై కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పౌరులకు కల్పించిందని పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉందని స్పష్టం చేసింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు ఒక ప్రజాస్వామ్య మార్గమని, అలాంటి సందర్భాల్లో చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవిస్తూ వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *