తెలంగాణలో రేవంత్‌ బుల్డోజర్ల పాలన

హైడ్రా పేరుతో  పేదల ఇండ్ల కూల్చిన బుల్డోజర్లు
ఇపుడు హెచ్‌సీయూ భూముల స్వాధీనానికి..
కాంగ్రెస్‌ పాలన తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం

గతంలో మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చిన రేవంత్‌ఇప్పుడు హెచ్‌సీయూ భూములపై పడ్డాడని ఆయన పాలనలో కేవలం బుల్డోజర్లు తప్ప ఏమి కనిపించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే అసలు కాంగ్రెస్‌కు ఎందుకు పాలన అప్పగించామంటూ అన్నివర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడిరచారని.. బంజరు భూములుబల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని.. ఇప్పుడు మీరు జంతువుల గూళ్ళను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ మండిపడ్డారు.

విధ్వంసం మీ ఏకైక నినాదం! మీ ఖజానాను దాఖలు చేయడమే ఏకైక నినాదం.. నేను మిమ్మల్ని అడుగుతున్నాను రేవంత్‌ రెడ్డి.. మీ బుల్డోజర్లు వారాంతంలోరాత్రిపూట ఎందుకు నిరంతరాయంగా పనిచేశాయి.. మీరు కోర్టుకు ఎందుకు భయపడుతున్నారుమీరు ఏమి దాచారుఅంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు చదును చేస్తుండడంతో అక్కడి అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జింకలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆగమాగం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పెద్ద సంఖ్యలో అర్ధరాత్రి మోహరించిన బుల్డోజర్ల కారణంగా నెమళ్ల అరుపులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page