– పీఎం ఈ-డ్రైవ్ కింద విద్యుత్ బస్సులు
– ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి పొన్నం సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. పి.ఎం. ఈ-డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్ లో ఎదురయ్యే సవాళ్లు ,మౌలిక సదుపాయాలపై స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి లతో కలిసి సెక్రటేరియట్ లో శుక్రవారం ఉదయం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిని క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పి.ఎం. ఈ-డ్రైవ్ కింద 9 నగరాల్లో 15 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందులో తెలంగాణ లో హైదరాబాద్ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఒక్కో బస్సుకు రూ.35 లక్షలు కేటాయిస్తుంది. ఈబస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 6 వ తేదీ టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ లో రాష్ట్రానికి కావల్సిన మౌలిక సౌకర్యాలు ,ఎదురవుతున్న ఇబ్బందులు, టెక్నికల్ ఆపరేషన్స్ పై సమీక్షా సమావేశంలో చర్చించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





