పోలవరంతో భద్రాచాలనికి ముప్పు

  • ఐఐటి హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం
  • బనకచర్లకు అనుమతులు లేవన్న అధికారులు
  • అవసరమైతే గోదావరి బోర్డుకు ఫిర్యాదు
  • ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్‌ ‌బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపైనా ఈ బృందం అధ్యయనం చేయనుంది. 2022లో వొచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని, 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వొచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని.. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలపాలని, అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్‌ ‌టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్‌ ‌టీంతో కో ఆర్డినేషన్‌ ‌కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ‌పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలియజేశారు.

ఫోటో :సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీశ్రీ సుదర్శనలక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండాసురేఖ, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీశ్రీ సుదర్శన దివ్యవిమానస్వర్ణ గోపుర మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *