– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడి
న్యూదిల్లీ, మే 1 : కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని సవరించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదని, అవి స్థిరంగానే కొనసాగుతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలోని వాహనదారులకు, సామాన్య వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒడిదొడుకులు, ప్రభుత్వ పన్నుల సవరణలు జరిగినప్పటికీ సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడకుండా చమురు సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ సుంకంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని ప్రభుత్వం, చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఇంధన సరఫరా గొలుసులో స్థిరత్వాన్ని కాపాడతామని, పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హావిÖ ఇచ్చింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఇంధన ధరలు పెరగకపోవడం అనేది రవాణా రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది. తద్వారా కూరగాయలు, ఇతర నిత్యావసరాల రవాణా ఖర్చులు పెరగకుండా ఉంటాయి. అంతర్జాతీయంగా ఇరాన్`అమెరికా మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ వంటి పరిణామాల వల్ల చమురు మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా ధరలను నియంత్రణలో ఉంచడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





