బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల జాబితా విడుదల


– ఎంజేపీ ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను సొసైటీ అధికారిక వెబ్ సైట్  • https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home , • https://mjptbcwreis.telangana.gov.in  లో చూసుకోáవచ్చునన్నారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని, విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలి అన్న వివరాలు తెలియ జేస్తారని  తెలిపారు. మెరిట్ లిస్టులో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. బీసీ గురుకుల ఇంటర్ కోర్సుల్లో ఫస్ట్ లిస్టులో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈనెల 4వ తేదీలోగా సంబంధిత కాలేజీలో రిపోర్టు చేయాలని డాక్టర్ మల్లయ్య తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *