– న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 3 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్ గ్రిడ్ బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని శ్రమశక్తి భవన్, న్యూఢిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న హై టెన్షన్ విద్యుత్ లైన్ వలన రైతులకు జరుగుతున్న నష్టాన్ని, అన్యాయాన్ని గురించి కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ విద్యుత్ లైన్ ఏర్పాటు వివరాలను రైతుల ద్వారా తెలుసుకున్నకేంద్ర మంత్రి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించి రైతులకు న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహా రెడ్డి, పిప్పల వెంకటేష్, కడారి రామకృష్ణ, గూడూరు పెంటారెడ్డి, గూద పర్వతాలు, జెల్ల శివరామకృష్ణ, క్యామ సత్యం తదితరులు ఉన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





