నకిలీ ఎన్‌వోసిలపై కొనసాగుతున్న విచారణ

– మరో 48 కాలేజీల చిట్టాను అందచేసిన హైడ్రా
– కాలేజీలపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకునే అవకాశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ఇం‌టర్‌ ‌కాలేజీల నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను హైడ్రా అధికారులు పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఒకే తరహాలో నకిలీ ఎన్‌ఓసీలు తయారు చేసినట్లు గుర్తించారు. దాదాపు 56 కాలేజీలు నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన హైడ్రా.. మరో 176 కాలేజీలపై విచారణ జరుపుతోంది. ఐదు అంతస్తులలోపు ఉన్న భవనాల అనుమతుల కోసం ఫైర ఎన్‌ఓసీలను హైడ్రా ఇస్తుంది. ఆఫ్‌లైన్‌లో ఎన్‌ఓసీలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌ఓసీల కోసం హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీలు సృష్టించి ఇంటర్‌ ‌బోర్డుకు కాలేజీలు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలను కాలేజీ యాజమాన్యాలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్‌వోసీల కోసం జీహెచ్‌ఎం‌సీ, హైడ్రా, ఫైర్‌ ‌మాజీ డీజీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. హైడ్రా నివేదిక, పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలను ఆధారంగా చేసుకుని కాలేజీ యజమాన్యాలపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *