– వారిని ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
– న్యాయం జరిగేవరకు పోరాడలేకపోయా.. క్షమించాలి
– ‘జాగృతి జనంబాట’ ప్రారంభంలో కవిత భావోద్వేగం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారి కోసం పోరాడలేకపోయామని, అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేవరకు పోరాడనందుకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ’జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ యాత్రకు ముందుగా గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి విూడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని అంగీకరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1,200 మంది ప్రాణ త్యాగం చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలకు అనుకున్నంత మేర న్యాయం చేయలేకపోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగామని, ఉద్యమకారులకు కొన్నిచోట్ల రాజకీయంగా నామమాత్రపు పదవులు దక్కాయి కానీ వారికి జరగాల్సినంత న్యాయం జరగలేదని తెలిపారు. ఎంపీిగా ఉన్నప్పుడు పార్టీ అంతర్గత వేదికలపై ఈ విషయం ప్రస్తావించినా వారి కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని, అందుకే ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని కవిత అన్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకపోతే రాబోయే ప్రభుత్వంతోనైనా ఇప్పించి తీరుతామని హావిూ ఇచ్చారు. ‘గృతి జనం బాట’ పేరుతో వరుసగా నాలుగు నెలలపాటు ప్రజలతో ఉండేలా ఆమె కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిజామాబాద్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీని పెట్టేందుకు కూడా సిద్ధమని వెల్లడిరచిన సంగతి తెలిసిందే. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కేవరకు తన పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోంచి బతుకమ్మను తీసేశారు.. తిరిగి ఆ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టే వరకు పోరాడదాం అని పిలుపునిచ్చారు. మనస్పర్థలను పక్కనపెట్టి జాగృతి మాజీ సభ్యులందరూ తిరిగి రావాలని, సామాజిక తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





