విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం

– బోర్డు తిప్పేసిప దశరథ్ కన్సల్టెన్సీ

హైదరాబాద్, ప్రజాతáంత్ర, మే 18: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్‌లో సీడీ దశరథ్ కన్‌స్టలెన్సీ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ముగ్గురు నిందితులు మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు. నిందితులు అర్చన, సోమశేఖర్, రాజేందప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాధితులు ఎంతమంది ఉన్నారనే అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *