భద్రాచలం, ప్రజాతంత్ర, మే 8 : తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మావోయిస్టుల కోసం కర్రె గుట్టల్లో పాగా వేసిన భద్రత బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటి సభ్యులు బండి ప్రకాష్లు పోలీస్ కాల్పుల్లో మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరి తలపై 20 లక్షల రివార్డు ఉంది.
కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్
