– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: రెండు దగ్గు మందులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ను విక్రయించొద్దంటూ అందులో పేర్కొంది. ఈ రెండు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వీటిని గుజరాత్కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కోల్డ్ రిఫ్ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం డీసీఏ ప్రకటించింది. చిన్నారుల్లో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ చర్య తీసుకుంది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరప్లను విక్రయించరాదని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు ఇవ్వకూడదని అధికారిక సూచనలు కూడా జారీ అయ్యాయి. కాంచీపురంలో తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేష్రన్ తనిఖీలు నిర్వహించింది. ఈ సిరప్ను తెలంగాణలో విక్రయించరాదని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





