ప్రజారోగ్య పరిరక్షణకు పక్కా చర్యలు

– ఆహార భద్రతపై సీస్ సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో శనివారం సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్ కంట్రోలర్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు, నాణ్యతలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఉన్న రెండు విభాగాలను ఏకతాటిపై నడిపేందుకు తగిన ప్రతిపాదనలను వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఆయా విభాగాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా తగిన విధంగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ సి.వి.ఆనంద్, సీ¾ఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, ఎన్.శ్రీధర్, జీఏడీి ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, అడిషనల్ డీజీ(ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, వైద్య శాఖ కమిషనర్ సంగీత, డ్రగ్ కంట్రోలర్ డీజీఅవినాష్ మొహంతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వర్షాభావ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించండి :కలెక్టర్లతో సిఎస్‌ ‌
తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు సిఎస్‌ ‌సంజయ్‌ ‌జాజు ఆదేశించారు. వర్షభావ పరిస్థితులను అధిగమించేందుకు జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని, దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సంజయ్‌ ‌జాజు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. వ్యవసాయం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, విద్యా శాఖల పురోగతిపై సుదీర్ఘంగా సక్షించిన ఆయన, రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా జరిగేలా గట్టి నిఘా ఉంచాలని, పంటల వైవిధ్యం పై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కాలానుగుణ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరని సీఎస్‌ ‌స్పష్టం చేశారు. పారిశుధ్యం, దోమల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతూనే, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, విద్యుత్‌ ‌సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రాణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కొరత లేకుండా సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటశాలలకు అనువైన స్థలాలను గుర్తించి, అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాధాన్యతా అంశాలన్నింటినీ కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, నిరంతర సక్షలు జరపాలని సీఎస్‌ ‌సంజయ్‌ ‌జాజు ఆదేశించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *