Category తెలంగాణార్థం

అణగారిన కులాలకు మేలు చేయాలని ఉందా?

ఈ శీర్షికలోనే 2024 నవంబర్‌ 7‌న రాసిన వ్యాసంలో ‘‘…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్‌ ‌గాంధీ ఈ కార్యక్రమ ప్రార ంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగ తులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్‌ ‌చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల…

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

బంధుతో, భరోసాతో అసలు సమస్యలు పోతాయా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివారం, జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు అనే నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నది. ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాధికారులు సర్వే చేసి రూపొందించిన జాబితాలో పేరు ఉండాలనే షరతు ఇప్పటికే కొంత గందరగోళానికి దారి తీస్తున్నది. ఆ జాబితాలను…

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…

మైలారం గుట్ట సమస్య మనందరిదీ!

నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు కొందరు జనవరి 5 ఆదివారం నాడు హైదరాబాద్‌ ‌వచ్చారు. తమ జీవన్మరణ సమస్య మీద పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ, కనీసం ఆరు సంవత్సరాలుగా మరింత తీవ్రమై, రెండు నెలలుగా తమ బతుకులకు ఆటంకంగా పరిణమించిన ఆ సమస్యను ప్రజల దృష్టికి తేవడానికి హైదరాబాద్‌ ‌వచ్చారు. సమస్యను…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

ప్రతి రోజూ కావాలి పుస్తకాల పండుగ!

ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండుగ జరగబోతున్నది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండీ’ అని సన్నాయి నొక్కులు నొక్కే వారుంటారు. పుస్తకమే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా ప్రపంచంగా బతుకుతున్నవాళ్లూ ఉంటారు. ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్త ఏమున్నది…

అవసరమేనా ఈ వివాదం?

అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ…

ఉడకలేదని తెలుపుతున్న మెతుకు!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పది సంవత్సరాల తెలంగాణ/భారత రాష్ట్ర సమితి పాలన తర్వాత, కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది నిండుతున్నది. ఏ ప్రభుత్వానికైనా ఏడాది పని తీరు ఒక గణనీయమైన సూచికే అవుతుంది. ఐదు మైళ్ల ప్రయాణంలో ఈ మైలు ఎలా గడిచిందో ఈ మైలురాయి దగ్గర ఆగి…