Category ప్రత్యేక వ్యాసాలు

‘ఎన్‌కె సమగ్ర రచనలు’

1970ల నుంచి 1990ల దాకా తెలుగు సీమ అంతటా విప్లవ గాయకుడుగా, కవిగా సుప్రసిద్ధుడైన ఎన్‌కె (ఎన్‌కె రామారావు) భౌతికంగా మన నుంచి దూరమై ఇవాళ్టికి పది సంవత్సరాలు. ఆయన జీవిత కాలంలో ఒక కవితా సంపుటం, ఒక దీర్ఘ కవిత, ఒక ఆత్మకథాత్మక రచన ప్రచురించాడు గాని అనేక ఇతర రచనలు పుస్తకరూపం ధరించకుండానే…

జిఎస్టీ బాదుడు ఇక ఆగేలా లేదు!

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎప్పుడూ ..ఎలాంటి చర్చా జరగకుండా ముగుస్తున్నాయి. ఇటీవలి సమావేశాలు కూడా అలాగే ముగిశాయి. ఇందులో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో, విపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. అంబేడ్కర్‌కు అవమానం అంటూ కాలయాపన చేసి సమావేశాలను ముగించారు. ఇకపోతే అధికార పక్షాన్ని నిలదీసే క్రమంలో విపక్షాలు ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించాయి. తమ ధోరణిలోనే పోరాటాలు సాగిస్తున్నాయి. ఇందులో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టామన్న ఆనందం కోసం చేస్తున్నదే తప్ప మరోటి కాదు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, జిఎస్టీ వాతలు, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం వంటి విషయాల్లో అధికార పక్షాన్ని నిలదీయలేకపోయారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాలను చర్చించడం లేదు. చర్చించాలన్న ఆసక్తి అధికార, విపక్షాలకు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే..అల్లు అర్జున్‌పై కేసు గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. కాంగ్రెస్‌ పాలనపై విమర్శలుచేస్తున్న బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలు తమ డొల్ల గురించి మాట్లాడడం లేదు. రాష్ట్రానికి ఏద్కెనా మంచి చేయాలన్న ఆలోచనతో లేరు. మోదీ అధికారం చేపట్టాక గత దశాబ్దకాలంగా ధరలు, పన్నులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు భారతీయులను అతలాకుతలం చేస్తున్నాయి. మోదీ అధికారం చేపట్టాక ధరలు, జిఎస్టీ, నిరుద్యోగం వంటివన్నీ దాడి చేస్తున్నాయి. అన్నదాతలు ఆగం అవుతున్నా పట్టింపు లేదు. అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి. కేవలం అధికారం కోసం పోరాటం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి. విపక్షనేత రాహుల్‌ గాంధీకి దేశ సమస్యలపై పెద్దగా అవగాహన లేదు. దీంతో ఆయన కేవలం పత్రికా ప్రకటనలు, పోజులకే పరిమితం అవుతున్నారు. అందుకే పార్లమెంటులో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. వీరికి తగిన మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేకుండా పోయారు. అందుకే తదుపరి అధికారం లక్ష్యంగా కాంగ్రెస్‌ తన పోరాట లక్ష్యాలను అమలు చేస్తోంది. కేవలం మోధీని లక్ష్యంగా చేసుకుని మాత్రమే కార్యాచరణ ఉంటోంది. ఇందుకు ప్రతిపక్ష పార్టీల నేతలంతా తానా అంటే తందానా అన్న చందంగా రాజకీయాలు సాగిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడగా దీనిని భావించాలి. ప్రతిపక్ష బాధ్యత సక్రమంగా, బలంగా ఉంటే అధికారపక్షాన్ని నిలదీయ వచ్చు. కానీ అలా జరగడం లేదు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలనే తీసుకుంటే విపక్షాల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ, ఆవరణలోనూ చోటు చేసుకున్న సంఘటనలు సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాదు, ఈ ఆందోళనలు శ్రుతిమించి పార్లమెంటు ప్రాంగణంలో సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, కొందరు గాయాలపాలు కావడం.. దరిమిలా పోలీసు స్టేషన్లకు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకోవడం చూసాం. వీరంతా మన ప్రతినిధులు అని చెప్పుకోవడానికి మనమంతా సిగ్గుపడాలి. ప్రజలకు మేల్కెన పాలన అందించేలా పార్లమెంటులో సమస్యలపై చర్చించాల్సిన ఎంపిలంతా ఆందోళనతో సమావేశాల విలువైన సమయాన్ని హరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ను కేంద్ర బిందువుగా చేసుకుని ఎవరికి వారు పైచేయి సాధించాలని పోటీపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో మాట్లాడుతూ అంబేడ్కర్‌ పేరును పదే పదే జపించే బదులు, దేవుడిని తలచుకున్నా ఏడేడు జన్మల స్వర్గప్రాప్తి లభించేదంటూ వ్యాఖ్యానించారు. ఇది అంబేడ్కర్‌ ను అవమానించడమేనని కాంగ్రెస్‌ సభ్యులు ఆ మరునాడు సభలో ధ్వజమెత్తారు. ఇందుకు అమిత్‌ షా క్షమాపణ చెప్పడంతోపాటు, రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో గలభా మొదల్కెంది. అంతటితో ఆగని విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష సభ్యుల దాడిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు.. హోం మంత్రి ప్రసంగంలోని కొన్ని పదాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందంటూ ఎదురుదాడి మొదలుపెట్టడంతో పరిస్థితి వేడెక్కింది. ఇక ఇంతటితో ఇది ఆగడం లేదు. అంబేడ్కర్‌కు అవమానమంటూ దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వారంపాటు ఉద్యమిస్తామని పేర్కొంది. నిజానికి నిర్మలా సీతారామన్‌ మరోమారు కొన్ని వస్తువులపై జిఎస్టీ వడ్డించారు. ఇన్సూరెన్స్‌ పథకాలపై జిఎస్టీ నిర్ణయాన్ని వాయిదా వేశారు. వీటిపై విపక్షాలకు కొంచెం కూడా చురుకు అంటడం లేదు. ఈ జిఎస్టీ వడ్డింపుల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జిఎస్టీ బాదుడు ఇక ఆగదన్న రీతిలో నిర్మలా సీతారామన్‌ నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో మోధీ పతనం దీంతోనే ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కొద్దిగా తమ రుచి చూపారు. జిఎస్టీపై చర్చించి ప్రజలపై భారం పడకుండా చూసుకోవాల్సిన మోదీ అలా ఆలోచించడం లేదు. దీనిని బ్రహ్మపదార్థంగా ప్రచారం చేసుకుంటున్నారు. 18శాతం వరకు జిఎస్టీ కారణంగా ప్రజలపై ప్రత్యక్ష భారం పడుతోంది. అంతిమంగా ప్రతి పన్నుకు ప్రజలే బాధితులు. ఇది వ్యాపారులపై భారం పడదన్న ఇంగితం లేని పాలకులు మనకు దాపురించారు. దీనిపై విపక్షాలు పోరాడడం లేదు. ఇన్సూరెన్స్‌లపై జిఎస్టీ బాదుడుపై ప్రస్తావించినా పట్టించుకోవడం లేదు. నిజానికి జిఎస్టీని సవిరీక్షించకుంటే హనుమంతుడి తోక లంకను తగులబెట్టిన చందాన, బిజెపి సామ్రాజ్యాన్ని జిఎస్టీ తగులబెట్టడం ఖాయం. ి -కందుల శ్రీనివాస్‌ (సీనియర్‌ జర్నలిస్ట్‌)

జిఎస్టీతోనే బిజెపి సామ్రాజ్యం పతనం ఖాయం   అన్నదాతలు ఆగం అవుతున్నా  పట్టింపు లేదు  అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో.. విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి.  కేవలం అధికారం కోసం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి… పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎప్పుడూ ..ఎలాంటి చర్చా జరగకుండా ముగుస్తున్నాయి.…

దేశపు మోహనం – మన్మోహనం

పుట్టింది పాత పంజాబ్‌లోని సిక్కుల కుటుంబం గడిపింది సాధారణ మధ్యతరగతి జీవనం తన విద్వత్తుతో విశ్వానికి సమాధానం మనసంతా జ్ఞానం నిండిన మాటల మౌనం దేశానికి స్వేచ్చనిచ్చిన ఆర్థిక పరిజ్ఞానం ప్రపంచీకరణకు బాటలు వేసిన ధీరత్వం ప్రధానిగా ప్రారంభించిన వంద రోజుల పని విధానం కేంబ్రిడ్జ్‌ నుండి కుగ్రామం వరకు తన ముద్ర వేసిన మహనీయుడుజి…

చరిత్ర శిఖరంపై మన్మోహనుడు!

Manmohan on the peak of history!

ప్లేటో తన రిపబ్లిక్‌ గ్రంధంలో ‘తత్వవేత్తలు పాలకులుగా ఉంటే ఒనగూరే ప్రయోజనాలను ఈ విధంగా చెప్పారు’ తత్వవేత్తలు సునిశిత మేధో శక్తిని, లోతైన  అవగాహనని, విజ్ఞతని కలిగి ఉంటారు, హేతువు, తర్కం, వాస్తవికతల ఆధారంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు, దురాశకు కాకుండా, అవి అంతిమంగా ప్రజల విశాల ప్రయోజనాలకు తోడ్పడతాయి’.…

టెక్నాలజీని బ్యాలెన్స్‌గా వాడుకోవాలి!

Technology should be used in balance!

టెక్నాలజీ అనేది  మనుషులను దూరం చేస్తోందా, బంధాలను బలోపేతం చేస్తోందా అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది. కానీ, మన చిన్న ప్రపంచాన్ని మాత్రం కొన్ని మైళ్ల దూరానికి తీసుకుపోతోంది. మునపటి తరానికి ప్రస్తుత తరానికి ఆలోచనలు, ఆచరణలో చాలా తేడా వుంది. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ అని…

అడుగడుగునా… విద్యలోనూ వివక్షతే…!

భారతీయ సమాజాన్ని వేల ఏళ్ల నాటి మను సంస్కతి నేటికీ పీడిస్తూనే వుంది. ‘స్త్రీ ఎప్పుడూ తండ్రి, భర్త, కొడుకు సంరక్షణలోనే వుండాలని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి’ అనే పురుషాధిక్య భావజాలాన్ని నేడు కూడా చలామణీ చేసేందుకు మనువాదులు యత్నిస్తున్నారు. దానికి నిదర్శనమే నేటికీ కొనసాగుతోన్న లింగ వివక్ష. స్త్రీ పట్ల సమాజం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తోందో తెలుపుతూ.. ‘నువ్వు ఆడదానివి, గీత దాటకూడని దానివి, మచ్చపడితే మాయని దానివి’ అంటుందని చెబుతారు అబ్బూరి ఛాయాదేవి. ఈ మచ్చలు, గీతలు స్త్రీలకే గాని పురుషులకు లేవంటుందీ సమాజం. ఈ సమాజంలో అమ్మాయిలకు అడుగడుగునా అవరోధాలే.. వారి కదలికలపై ఎన్నో ఆంక్షలు, నిర్బంధాలు. పాప-బాబు, అమ్మాయి-అబ్బాయి, మహిళ-పురుషుడు అన్న ఈ పదాల మధ్య గీతలు చెరిపేసి, సమానం అని చెప్పాలనుకున్నా, పురుషాధిపత్య భావజాలం ఏదోఒక రూపంలో మొలకెత్తుతూనే వుంది. ఇంట్లో కనీసం ఒక్క మగపిల్లాడ్కెనా వుండాలని కోరుకునే భావన బలంగా వేళ్లూనుకుని వుంది. అమ్మాయిల్కెతే పెళ్లి తర్వాత అత్తవారింటికి వెళ్లిపోతారు, అదే అబ్బాయిల్కెతే వృద్దాప్యంలో తమను చూసుకుంటారని, అండగా వుంటారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ, కొడుకు కంటే కూతురే నయమని అనుభవం చెబుతోంది. సమాజం అన్ని రంగాల్లోనూ మారుతున్నా అమ్మాయిలు- అబ్బాయిల పెంపకం విషయంలో మాత్రం పెద్దగా మారలేదు. కుటుంబానికి స్త్రీ పురుషుల ఇద్దరి అవసరం ఉంటుంది. బండికి రెండు చక్రాల వంటి వారు. కానీ సమాజం వారిని వేరు చేసి చూస్తూంది. ఈ తరహా విభజన ప్రాథమిక పాఠ్యాంశాల నుంచి సాహిత్యం వరకూ, సీరియళ్ల నుంచి సినిమాల వరకూ అబ్బాయిలకు ప్రాధాన్యతనివ్వడం చూస్తూనే వున్నాం. విద్యలోనూ వివక్షతే. మగపిల్లలను బయట చదువులకు పంపించే తల్లిదండ్రులు ఆడపిల్లలను పంపడానికి సంకోచిస్తారు. ఎవరో ఒకరినే చదివించాల్సిన పరిస్థితివుంటే అబ్బాయిలకే ప్రాధాన్యతనిస్తారు. పిల్లల పుట్టుక దగ్గర నుంచి పెంపకం వరకూ ఈ వివక్ష అడుగడుగునా కొనసాగుతూనే వుంది. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పిండ దశలోనే అంతమొందిస్తున్నారు. ‘జనాభా లెక్కల్లో స్త్రీలకంటే పురుషుల సంఖ్యే ఎక్కువ’ అని కేంద్ర ప్రభుత్వం గత వందేళ్లుగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా పురుషాధిపత్య భావజాల ఫలితమే. స్త్రీలను మగవారు తక్కవ చేసి చూడటం ఇంటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ముందు తల్లులు మారాలి. అమ్మాయిల పట్ల కఠినత్వం కాకుండా, మార్థవం అబ్బాయిల్లో జీర్ణించుకునేలా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అమ్మాయి, అబ్బాయి సమానమేనన్న భావన ఇంటి నుంచి, చిన్న వయసు నుంచే మొదలవ్వాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇంటర్నెట్‌ యుగంలో సోషల్‌విరీడియా, ఏఐ వంటి మాధ్యమాలు అందుబాటులో వున్న నేపథ్యంలో టీనేజ్‌ పిల్లల భావోద్వేగాలను నిశితంగా గమనిస్తుండాలి. ఒకవైపు కార్పొరేటీరణ, మరోవైపు మనువాదం నేర్పిన సనాతనధర్మం పురుష మెదళ్లలో చెత్తలా పేరుకుపోతోంది. ఈ చెత్తను తొలగించే బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులది, పాఠశాలలో ఉపాధ్యాయులది. ఇంట్లో తల్లిని, చెల్లినీ గౌరవించడం నేర్పాలి. బయటి స్త్రీలకు కూడా అంతే గౌరవ మర్యాదలివ్వాలి. పాఠ్యాం శాల్లోనూ అమ్మాయి-అబ్బాయి సమానమన్న భావన పాదుకొల్పాలి. ఆ దిశగా అబ్బాయి లను పెంచాలి. వారి మానసిక వికాసానికి తోడ్పడాలి. వంట చేయడం, ఇల్లు తుడవడం వంటివి కేవలం అమ్మాయిల పని మాత్రమే కాదు, అబ్బాయిలూ నేర్వాలన్న విజ్ఞత తల్లిదండ్రులే నేర్పాలి. ఇంటి పనంటే ఇంతులది కాదని చెప్పాలి. అమ్మాయిలతో పాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చేయాలి. అబ్బాయిల పెంపకంలో ఈ తరహా మార్పు అత్యవసరం. -మహేందర్‌ మిట్టపల్లి (సీనియర్‌ జర్నలిస్ట్‌)

భారతీయ సమాజాన్ని వేల ఏళ్ల నాటి మను సంస్కతి  నేటికీ పీడిస్తూనే వుంది. ‘స్త్రీ ఎప్పుడూ తండ్రి, భర్త, కొడుకు సంరక్షణలోనే వుండాలని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి’ అనే పురుషాధిక్య భావజాలాన్ని నేడు కూడా చలామణీ చేసేందుకు మనువాదులు యత్నిస్తున్నారు. దానికి నిదర్శనమే నేటికీ కొనసాగుతోన్న లింగ వివక్ష. స్త్రీ పట్ల సమాజం…

మనోవర్తి అనేది మానవ హక్కుల్లో భాగమే!

చట్టాలను పటిష్టంగా రూపొందించాలి… కాలపరీక్షకు లోనవుతున్న వివాహ వ్యవస్థ   దేశ సర్వోన్నత న్యాయస్థానం మానవ సంబంధాలు, కటుంబ, వివాహ వ్యవస్థలపై  తరచూ తమ తీర్పులలో కీలక వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ జంటకు విడాకులు ఇచ్చే సమయంలో పెళ్లి బంధం గురించి సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య…

దామాషా ప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

 అల్లుడు వొస్తే ఇక అరుగుమీదనే ..! ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగులేకున్నా రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఆరునెలలుగా ఖాళీ గా ఉన్న చీఫ్ ఇంజనీరు పోస్టును ఎట్టకేలకు భర్తీ చేసారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కావాలని 80లక్షల మంది దరఖాస్తు…

ఈవీఎంలపై ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరించాలి

The Election Commission should act transparently on EVMs

ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్‌ పత్రాలను ప్రవేశపెట్టాలన్న పిటిషన్‌ను జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం గత ఏప్రిల్‌లో తిరస్కరించిన సంగతి  తెలిసిందే.  అయితే.. ఇటీవల సుప్రీంకోర్టులో ఈవీఎంలపై మరో వ్యాజ్యం దాఖలయి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. దీనిపై జనవరి 20వ తేదీతో ప్రారం భమయ్యే వారంలో విచారణ జరగనుంది. న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌…