Category ముఖ్యాంశాలు

జనగణనపై నోటిఫికేషన్‌ జారీ

కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ జారీతో జనగణన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. మొత్తం రెండు దశల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1వ తేదీనాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. మంచు ఎక్కువగా…

హరీష్‌రావుకు అస్వస్థత.. హాస్పిటల్ లో చికిత్స 

మాజీ మంత్రి హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆయన బేగంపేట సన్‌షైన్‌ కిమ్స్‌ హాస్పిటల్ లో  చేరినట్లు సమాచారం. కేటీఆర్‌ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

పోలవ‌రం టి.ఒ.ఆర్‌. మార్పులు తిర‌స్క‌రించాలి

Minister Uttam Kumar Reddy

మంత్రి ఉత్త‌మ్‌కుమార్ డిమాండ్‌  కేంద్ర‌మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యావరణ,అటవీ శాఖామంత్రి భూపెందర్…

స్కిల్‌ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి విజ్ఞప్తి నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం మెగా జాబ్‌/స్కిల్‌ లోన్‌ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  తెలంగాణను ‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌’గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ…

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల‌బ్దిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు

ఒక్కో ఇంటి నిర్మాణానికి  రూ.5ల‌క్ష‌ల స‌హాయం 2.65 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారుల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాలు 71 వేల ఇండ్లు గ్రౌండింగ్‌ రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మొండి గోడ‌ల‌తో అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను పూర్తిచేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ ముందుకు రాని ప‌క్షంలో ల‌బ్దిదారులే ఆ…

రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ అన్నదాతల కోసం ఏటా 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్ఎస్ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే…

రైతును రాజును చేయ‌డ‌మే ల‌క్ష్యం

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా రైతుభ‌రోసా ఆప‌బోం దేశంలో మొట్ట‌మొద‌టిసారి స‌న్న‌బియ్యం ఇస్తున్నాం రైతు నేస్తం కార్యక్రమంలో  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో, దేశంలో నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా రైతుల అండ ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి…

స్థానిక సంస్థల ఎన్నికలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న ప్ర‌భుత్వం?

government preparing for local body elections?

( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నది. చాలాకాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావర‌ణం వున్నట్లుగా భావిస్తున్నది. మరింత ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల రాష్ట్రమంత్రులు ఒకరితర్వాత ఒకరు…

తెలంగాణ ప్రతిష్టను పెంచాను

KTR

తలదించుకునే పనేం చేయలేదు అవినీతి జరగని కేసులో ఏసీబీని రంగంలోకి దించడమేంటి? అరెస్ట్‌ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్రమంతటా చాటాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కానీ తలదించుకునే పని చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు…