లోయలో పడ్డ వాహనం

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం

నైనిటాల్‌, ఆగస్ట్ 8: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దేవ్‌‌ప్రయాగ్‌ ‌నుంచి పౌరీ వెళుతున్న బొలెరో వాహనం శుక్రవారం సాయంత్రం సబ్దర్‌ఖల్‌ ‌వద్ద రోడ్డు పక్క ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే దేవ్‌‌ప్రయాగ్‌ ‌పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలెరోలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. వాహనం లోయలో పడగానే తీవ్రగాయాలతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని సహాయక సిబ్బంది దగ్గరలోని హాస్పిట‌ల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *