– కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నాలు
– 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి సంపాదించిన రూ.లక్ష కోట్లతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమ ప్రజాప్రబభుత్వాన్ని కూలదోయడానికి పన్నాగాలు పన్నుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఎస్.పి.ఆర్.హిల్స్ నుంచి జెండాకట్ట, కార్మిక నగర్, వినాయకనగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం కమీషన్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ను ఓడిరచాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, ఆ సొమ్ముతోనే విచ్చలవిడి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 500 రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ కేటీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ రెండేళ్లు పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 500 రోజుల్లో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతోందని, ఓడిపోతామని తెలిసి ఆ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. విజ్ఞలైన ఈ ప్రాంత ఓటర్లు గత పదేళ్లలో ఆ నాటి ప్రభుత్వం ప్రజలకు, ఈ ప్రాంతానికి ఏమి చేసిందో గమనించి ఉచిత బస్సు మొదలులకొని ఎనో ్నసంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్ను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ గల్లీల్లోకి వచ్చే బీఆర్ఎస్ నాయకులను ఇంతవరకు ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఈ మూడేళ్లే గాక మరో ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, పేదోళ్ల కన్నీరు తుడిచేవరకు కాంగ్రెస్ విశ్రమించదని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాము ఇంతవరకు గ్రామీణ ప్రజలపై దృష్టి సారించామని, ఇకపై పట్టణ పేదలకూ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్లో చేరికలు
మంత్రి పొంగులేటి సమక్షంలో ఎస్పీఆర్ హిల్స్లో బీఆర్ఎస్ నుంచి ప్రేమ్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు కాంగ్రెస్లో చేరారు. బ్రహ్మశంకర్ నగర్లో బి.కళ ఆధ్వర్యంలో పదిమంది మహిళలు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరగా మంత్రి పొంగులేటి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్మిక నగర్లో ఆటో యూనియన్ అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో 200మంది ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. వీరికి మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు సతీష్ ఆటోలో మంత్రి పొంగులేటి కొద్దిదూరం ప్రయాణించారు. మంత్రి పొంగులేటి పర్యటనకు మద్దతుగా కార్మిక నగర్లో 200 మంది ఆటో డ్రైవర్ల ఆటో ప్రదర్శన నిర్వహించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





