Prajatantra Desk

Prajatantra Desk

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ ‌గంగన్న హతం -27 ‌మంది మావోయిస్టులు మృతి – మృతుల సంఖ్య పెరిగే అవకాశం – మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ‌ – కేశ‌వ‌రావుపై కోటిన్నర రివార్డు –  భారీగా ఆయుధాలు స్వాధీనం – 27 మృతదేహాలు స్వాధీనం – బస్తర్‌ ఐజి సుందర్‌రాజు బుధ‌వారం…

అప్రమతంగా ఉండాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

CM Revanth Reddy

హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు…

పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు  

Rains

కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీనితో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో…

రాష్ట్రంలో మ‌రో ఐదురోజులు భారీ వ‌ర్షాలు

– ఈదురు గాలులతో కూడిన వాన‌లు ప‌డే అవ‌కాశం – వాతావరణశాఖ హెచ్చ‌రిక‌ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా…

నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి

మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా రుతు పవనాలు వొచ్చే జూన్‌ 1‌వ తేదీ కన్నా చాలా ముందుగానే కేరళను చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)  పేర్కొంది. మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ నెల 22…

నేడు ప్ర‌ధానిచే 103 అమృత్‌భార‌త్ రైల్వే స్టేష‌న్లు ప్రారంభం

– వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్న న‌రేంద్ర‌మోదీ – రాష్ట్రంలో బేగంపేట‌, క‌రీంన‌గ‌ర్‌, వరంగ‌ల్ రైల్వేస్టేష‌న్లు  ప్రారంభం – పాల్గొన‌నున్న కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో  అత్యాధునిక సౌకర్యాల‌తో కూడిన  103 అమృత్ భార‌త్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు  వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో…

కాళేశ్వ‌రంపై రాజ‌కీయ క‌క్ష లేదు

– కేవ‌లం అవినీతిని వెలికి తీసేప‌నిలో క‌మిష‌న్‌ – విచార‌ణ‌కు కె.సి.ఆర్‌. హాజ‌రు కావాలి – ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌ రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతికి బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ జరుగుతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం…

 బెంగ‌ళూరులో ప‌ర్య‌టించిన ఉప‌ముఖ్య‌మంత్రి

– భూగ‌ర్భ‌ విద్యుత్ సరఫరా పై అధ్యయనం -ఫ్యూచ‌ర్ సిటీకి ఇది ఉప‌యోగ‌క‌ర‌మ‌న్న మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగ‌ళూరులో  విద్యుత్ శాఖ అధికారులతో బిజీగా గడిపారు. బెంగళూరు న‌గ‌రంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థ పై అధ్యయనం చేశారు. మొదట కర్ణాటక పవర్ ట్రాన్స్ మిష‌న్…

కె.సి.ఆర్‌తోనే రాష్ట్రానికి పూర్వ వైభ‌వం-ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

harees rao

మళ్ళీ కెసిఆర్ రావాలి,  తెలంగాణకు పూర్వ వైభవం తేవాల‌ని, యావత్ రాష్ట్రప్రజానీకం ఎదురు చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.ఏదో మార్పు తెస్తారని అనుకోని కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడని విమర్శించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుకా…

ప‌ర్యావ‌ర‌ణ హితం ల‌క్ష్యంగా వాల్టా చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి

స‌హ‌జ వన‌రుల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచాలి మండ‌ల‌స్థాయి వ‌రకు వాల్టా అథారిటీల‌ను నియ‌మించాలి నీటివినియోగంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి ఆకుప‌చ్చ తెలంగాణ కోసం వాల్టా చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యావరణ హితంగా ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా…