NEWS

NEWS

ముంబైలో భారీ వర్షాలు

ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ‌జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంధేరి ప్రాంతంలో…

నదిలో బోల్తాపడ్డ పెళ్లిబృందం ట్రక్కు

భోపాల్‌, ‌జూన్‌ 28 : ‌మధ్యప్రదేశ్‌ ‌లోని దతియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. గత…

కూలిన అండర్‌ ‌బ్రిడ్జి రీలింగ్‌ ‌రాడ్‌

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం బెంగళూరు, జూన్‌ 28 : ‌కర్ణాటక రాష్ట్రం హుబ్బలిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్‌ ‌బ్రిడ్జ్ ‌వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్‌ ‌రాడ్‌  ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. రైల్వే బ్రిడ్జి ముందు…

ఎన్సీపీ పోస్టర్లలో కానరాని అజిత్‌ ‌పవార్‌ ‌ఫోటో

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కనిపించిన దృశ్యం న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్సీపీ కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత అజిత్‌ ‌పవార్‌  ‌ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌మాత్రమే పార్టీ పోస్టర్లలో ఉన్నారు.…

వ్యవసాయ రుణాలకు కౌలు రైతులకు అర్హత

వృత్తి నిపుణులుగా గుర్తింపు…జాబితాలో చేర్పు ఏపీ సీఎం జగన్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయం…ఆదేశాలు అమలాపురం, జూన్‌ 28 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కౌలురైతులకు అండగా కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వ్యవసాయ వృత్తి నిపుణులుగా గుర్తించింది. ప్రైవేటు ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులను కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేర్చారు. ఇతర వృత్తి నిపుణులకు…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం

కంటి చూపుకు ఢోకా రాకుండా ‘కంటి వెలుగు’ ద్వారా పరీక్షలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు సరోజినీ దేవి హాస్పిటల్‌లో ఫ్యాకో మెషిన్లు ప్రారంభించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు..అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి…

భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక

లక్షల మందితో జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన ఖమ్మంలో ప్రవేశించే భట్టి యాత్రకు ఘన స్వాగతం పలకనున్న పొంగులేటి మీడియా సమావేశంలో మాణిక్‌ ‌రావు థాక్రే సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్‌ ‌సభ్యులు…

దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ పివి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్‌…

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి బంధం బలపడిందా…!

ఇటీవల కొంత కాలంగా…ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్‌ అద్భుత విజయం అనంతరం తెలంగాణలో రాజకీయ పార్టీల, నాయకుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక లో• ఎన్నికల ఫలితాలు వొచ్చేంత వరకు తరచుగా జాతీయ నాయకుల సభలతో, రకరకాల కార్యక్రమాలతో…

జివో 47పై హైకోర్టు ధర్మాసనం స్టే

ఇదో రకమైన భూకబ్జానే అంటూ వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌జూన్‌ 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. 2021లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బలమైన కులాలకు భూకేటాయింపులు…