NEWS

NEWS

ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ ను  కోరిన బిఆర్ఎస్ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో…

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం తరం కాదు

బిఆర్ఎస్ గతంలో ఏం చేసిందో చూసుకోవాలి బిజెపి, బిఆర్ఎస్లపై  మండిపడ్డ పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం…

అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన

వరంగల్,ప్రజాతంత్ర,మార్చి18:అన్నదాతలను ప్రకృతి పగబట్టింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. చేతికందిన పంట వర్షార్పణం అయిపోతుండటంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అసలే ఈ ఏడాది మిర్చికి సరైన ధర లేక తలలు పట్టుకుంటున్న రైతులకు ఇప్పుడు వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.…

మోదీ అసత్యాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి18: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది రే…

తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం

నిమిషం గడువు ఎత్తేసిన బోర్టు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18:  తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభ మయ్యాయి. 18నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి…

ఎన్నికల్లో ఈసీ నిబంధనలు

న్యూదిల్లీ,మార్చి18: లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికలు అనగానే ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో అభ్యర్థికి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

నా వ్యాఖ్యల వక్రీకరణ మోదీ తీరుపై మండిపడ్డ రాహుల్

న్యూదిల్లీ,మార్చి18: ‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వక్రీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రాహుల్ సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన వాదన వినిపించారు. మోదీ నా మాటలు ఇష్టపడరు. ఆయన నా మాటలు వక్రీకరించేందుకు,…

అనర్హత నుంచి దానం తప్పించుకోలేరు

స్పీకర్ త్వరగా వ్యవహారం తేల్చాలి:  మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల…

గవర్నర్ తమిళిసై రాజీనామా

ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18:  గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమిళసై…

అబ్ కీ బార్.. చార్ సౌ పార్

దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా.. దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం.. ఇది మీడియా వారికి హోంవర్క్ .. కావాలంటే చూసుకోవచ్చు మీ అండతోనే శక్తి వినాశకారులను ఎదుర్కొంటా.. జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చ్ 18: మూడోసారి అధికారంలోకి రాబోతున్న ఎన్ డి ఏ కూటమికి 400 సీట్లు అందించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర…