న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : హిమనీ నదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. యూకేలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రమాదం బారిన పడే ప్రజల్లో సగం మంది భారత్, పాకిస్థాన్, పెరూ, చైనా దేశాల్లోనే ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. ఇందులో కూడా అత్యధిక సంఖ్యలో అంటే సుమారు 2-3 మిలియన్ల మంది భారత్, పాక్లోనే ఉన్నట్టు తెలిపింది.