రాష్ట్రంలో ఇన్ని నిర్బంధాలు ఎందుకు?: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 6:  ‌రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావని ధ్వజమెత్తారు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్‌ ‌నడిగడ్డపై ఉన్న అంబేడ్కర్‌ ‌సైతం నివ్వెరపోతున్నాడని చెప్పారు. అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page