హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీలు కవిత, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఆయన బయటకి వెళ్లనీయకుండా గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ఇక శుక్రవారం ఉదయం నుంచే ఎమ్మెల్సీ కవిత ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. వారి నివాసాల వద్ద భారీగా మోహరించారు.