రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ నేతృత్వలో కమిటీని నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్)ను, సభ్యునిగా బి. రామయ్య(రిటైర్డ్ ఐఎఎస్)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.