– 17నుంచి ఆన్లైన్లో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు టీజీఆర్టీసీ కొత్త బస్సు పాసులను ఆన్లైన్ ద్వారా జారీ చేయనుంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2026-2028 సంవత్సరాలకు ఐ అండ్ పీఆర్ శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు రాయితీ బస్ పాసులు ఇవ్వనున్నారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు ఈనెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా బస్ పాసుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. https://tgsrtcpass.com/వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9959226390 నంబర్లో సంప్రదించవచ్చని ఆర్టీసీ తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



