•అప్రమత్తం అయిన రక్షణ దళాలు
న్యూదిల్లీ,మే 8: భారత్- పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చు తు న్నాయి. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లతో దాడులకు యత్ని స్తున్నట్లు- జాతీయ డియాలో కథ నాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్ స్ట్రిను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లు- తెలుస్తోంది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. కిష్త్వార్, అఖ్నూర్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది.