- — చార్మినార్, లాడ్ బజార్ లకు గ్లోబల్ ఎక్స్పోజర్
మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల13 న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లలో హైదరాబాద్ తో పాటు చార్మినార్ , లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని,వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు. 120 దేశాల మిస్ వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే…. ఈ హెరిటేజ్ వాక్ ను 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ ఈవెంట్ ను తిలకిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించేలా ప్రణాళిలు సిద్ధం చేసినట్లు గురువారం స్పెషల్ కమిషనర్, రాష్ట్ర సమాచార , పౌర సంబంధాల శాఖ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ప్రమోట్ చేయనున్నారు.