ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచే అమల్లోకి వొచ్చాయి. మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్పై రూ. 20, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్పై రూ. 40, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 750 ఎంఎల్పై రూ. 80 పెంచింది. రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్పై రూ. 40, రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్పై రూ. 80, రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న750 ఎంఎల్పై రూ. 160 పెంచింది. మద్యం ఎంఆర్పీ క్వార్టర్పై రూ. 10, హాఫ్ పై రూ. 20, ఫుల్ బాటిళ్లపై రూ. 40 పెరిగింది. అన్ని రకాల బీర్ బాటిల్ ఎంఆర్పీపై రూ. 10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
చివరి సారిగా 2020, మే నెలలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. పాత ఎంఆర్పీలు ఉన్నా కొత్త ధరలు వర్తిసాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంఆర్పీ ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2523. ధరల పెంపు కారణంగా బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వైన్స్, బార్, రెస్టారెంట్లను ఆబ్కారీశాఖ అధికారులు సీజ్చేశారు. ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలు సేకరించారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి తెచ్చుకున్న స్టాక్కు కొత్త ధరలు అమలు చేయడంలో భాగంగా వివరాలు తీసుకున్నారు. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్కు అనుగుణంగా దుకాణదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.