సైబర్‌ ‌నేరాలను కట్టడి చేస్తాం..

నేరాల విధానం వేగంగా మారుతోంది

•ఫేక్‌ ‌న్యూస్‌ ‌సైతం మరో ప్రధానమైన ముప్పు

•సోషల్‌ ‌మీడియాలో తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం

•రాష్ట్రాన్ని సైబర్‌ ‌సేఫ్‌ ‌స్టేట్‌ ‌గా మార్చేందుకు కలిసి పని చేద్దాం…

•సైబర్‌ ‌సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ 2025‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దేశంలో సైబర్‌ ‌నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా వెల్లడిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మన పౌరులకు ముప్పుగా మారుతోందన్నారు. తెలంగాణలో సైబర్‌ ‌నేరాలను కట్టడి చేసేం దుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ‌హెచ్‌ఐసిసీ లో సైబర్‌ ‌సెక్యూరిటీ కాన్‌ ‌క్లేవ్‌ – 2025 (‌షీల్డ్) ‌ను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందులో మంత్రి శ్రీధర్‌ ‌బాబు, డీజీపీ జితేందర్‌, ‌పోలీస్‌ ఉన్నతా ధికారులు, సైబర్‌ ‌సెక్యూరిటీ నిపుణులు పాల్గొన్నారు. ఈసం దర్భంగా ముఖ్య మంత్రి రేవంత్‌ ‌రెడ్డి మాట్లా డుతూ.. దేశంలోనే సైబర్‌ ‌సేఫ్టీలో మన రాష్ట్రాన్ని నంబర్‌ ‌వన్‌ ‌గా నిలపడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డిజిటల్‌ ‌సేఫ్టీ, భవిష్యత్‌ ‌కార్యాచరణ గురించి చర్చిం చేందుకు షీల్డ్ 2025‌ని నిర్వహిం చుకుంటున్నామని తెలిపారు. మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్‌ ‌సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్‌ ‌పోలీస్‌, ‌సొసైటీ ఫర్‌ ‌సైబరాబాద్‌ ‌సెక్యూరిటీ కౌన్సిల్‌ ‌ను సీఎం రేవంత్‌ అభినం దించారు. దేశంలో సైబర్‌ ‌నేరగాళ్లు గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా వెలువడిందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మన పౌరులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ఫేక్‌ ‌న్యూస్‌ అనేది కూడా మరో ప్రధానమైన ముప్పుగా పరిణమించిందని తెలిపారు. సోషల్‌ ‌మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు.

సైబర్‌ ‌సెక్యూరిటీ సొల్యూషన్స్ ‌కోసం ఎకో సిస్టమ్‌ ‌వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు… మా ప్రభుత్వం నిపుణులు, ఐటి సంస్థలతో కలిసి పనిచేయడానికి, అన్ని రకాల వనరులు సమకూరుస్తోందన్నారు. మనం తెలంగాణను సెక్యూర్‌ ‌బిజినెస్‌ ‌హబ్‌ ‌గా మార్చాలి. 1930 నంబర్‌ను అందరికీ షేర్‌ ‌చేయాలి. ఇది 24/7 సైబర్‌ ‌హెల్ప్‌లైన్‌. ‌పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్‌ ‌సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకి తమైన సైబర్‌ ‌క్రైమ్‌ ‌హెల్ప్‌లైన్‌ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని సిఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

తాము గత ఏడాది 7 కొత్త ప్రత్యేక సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లను ప్రారంభించామని చెప్పారు. ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసిన డిజిపి, సైబర్‌ ‌బ్యూరో డైరెక్టర్‌ని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టిజి సీఎస్‌బి బృందాన్ని సీఎం రేవంత్‌ అభినందించారు. తెలంగాణను సైబర్‌ ‌సేఫ్‌ ‌స్టేట్‌ ‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. సమాజంలో వొస్తున్న కొత్తకొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. సైబర్‌ ‌క్రైం ను నియంత్రించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని,

కానీ సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా నిరోధించేలా చూడాలని సీఎం అన్నారు. కొంతమంది సోషల్‌ ‌మీడియాలో ఫేక్‌ ‌న్యూస్‌ ‌ను ప్రచారం చేస్తున్నారని, నకిలీ వార్తలతో పాటు ఆర్థిక నేరాలను కూడా నిరోధించాల్సిన అవసరం ఉందని, సైబర్‌ ‌క్రైమ్‌ ‌నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌గా తీర్చిదిద్దుదామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page