ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: తెలంగాణలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో తమ పాలసీలు, పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భారత్ సమ్మిట్ కు అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. భారీ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామన్నారు. మా ప్రభుత్వం వొచ్చిన మొదటి రోజు నుంచే ప్రజలు కేంద్రం గా అనేక కార్యక్రమాలు చేపట్టాం. వారే కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నాం. అణగారిన, పేదవర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పుకునేందుకు భారత సమ్మిట్ ఒక వేదిక మాత్రమే కాదు.. అనేక విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.