తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా?

  • సోనియా గాంధీని దేవత అనలేదా..?
  • అక్రమంగా పది లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్‌
  • ‌కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా అని కేసీఆర్‌ ‌తీరును మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కమార్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌పదేండ్లలో 10 వేల అబద్దాలు ఆడారని వారు విర్శించారు. ఏ మోహం పెట్టుకుని కాంగ్రెస్‌ ‌ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ దేవత అని కేసీఆర్‌ ‌గతంలో అనలేదా అని ప్రశ్నించారు. సోనియా కాళ్లు మొక్కిన వ్యక్తి కేసీఆర్‌ అని కోమటిరెడ్డి అన్నారు. పదేండ్లలో కేసీఆర్‌ అ‌క్రమంగా 10 లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్‌ ‌హయాంలో అవినీతికి పాల్పడిన అధికారులు కొందరు జైల్లో ఉంటే మరి కొందరు అమెరికాలో ఉన్నారని విమర్శించారు. తాము అబద్దాలు చెప్పి ఉంటే ఎప్పుడో అధికారంలోకి వొచ్చే వాళ్లమన్నారు. మేం తల్చుకుంటే బీఆర్‌ఎస్‌ ‌కంటే తలదన్నే మీటింగ్‌ ‌పెట్టగలమన్నారు.

గతంలో సోనియాను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ విలన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాగాంధీ ఆశీస్సులు తీసుకోలేదా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని అసెంబ్లీలో కేసీఆర్‌ అనలేదా? ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం క్రమక్రమంగా నెరవేరుస్తోంది. కేసీఆర్‌ ‌పదేళ్లు అధికారంలో ఉండి రూ.10వేల కోట్లు దోచుకుతిన్నారు. ధరణి పోర్టల్‌ ‌తీసుకొచ్చి వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్‌ ‌చేయించి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పదేళ్లు పాలించిన కేసీఆర్‌.. ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

మరో దశాబ్ధం నల్గొండ కాంగ్రెస్‌ ‌దే: మంత్రి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

అభివృద్ధి విషయంలో తాము ఎక్కడా రాజీపడబోమని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. నల్గొండకు రూ.700 కోట్లతో రింగ్‌ ‌రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ కాంగ్రెస్‌ను సమర్థంగా నడిపించే నేతలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పారు. నల్గొండ కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్‌ ‌శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ పట్టణాన్ని మంత్రి కోమటిరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కితాబిచ్చారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. డిండి, ఏదుల ప్రాజెక్టులను కేసీఆర్‌ ‌పదేళ్లపాటు పట్టించుకోలేదు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పదేళ్లపాటు- కేసీఆర్‌ ‌పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మళ్లీ పని ప్రారంభించిన కొన్ని రోజులకే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. ఇప్పటికైనా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నల్గొండ జిల్లా నాయకులం ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నాం. ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రజలు సహకరించాలి. రైతులను ఒప్పించిన తర్వాతే ప్రాజెక్టులకు భూసేకరణ చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకాన్ని సంస్థాన్‌నారాయణపురం, చౌటు-ప్పల్‌ ‌వరకు పొడిగిస్తాం. పూడిక వల్ల ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థం తగ్గింది.

ఎస్‌ఆర్‌ఎస్పీ ఫేజ్‌-2 ‌పనులను పూర్తి చేస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి సమస్య తీరుతుంది. సాగునీటి రంగంలో రూ.1.81 లక్షల ఖర్చు చేసి, భారాస నేతలు జేబులు నింపుకొన్నారు. భారాస నేతల కషన్ల కక్కుర్తి వల్లే, రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిన కాళేశ్వరం నాణ్యత లోపించి మూడేళ్లలోనే కూలిపోయింది. రాష్టాన్న్రి తాకట్టుపెట్టి.. అప్పులు చేసి కాళేశ్వరం పేరిట రూ. లక్ష కోట్లు- ఖర్చు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్‌డీఎస్‌ఏ ‌చెప్పింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొని రాష్టాన్రికి కేసీఆర్‌ ‌తీవ్ర అన్యాయం చేశారు. కానీ, తెలంగాణకే 500 టీఎంసీలు కేటాయించాలని ఈ ప్రభుత్వం పోరాడుతోందని ఉత్తమ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page