హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 04: ఆర్టీసీ వ్యవస్థలో 10-15 సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపో లు ఏర్పాటు చేస్తున్నా మని రవాణా, బిసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా తనకు సంతృ ప్తిస్తోందని అన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకు పోతు న్నామని చెప్పారు. నూతన ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు ,కార్మికుల సంక్షేమం కోసం శ్రమిస్తున్నామని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంగా ఉన్న పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కొత్త ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ములుగు ఆర్టీసీ డిపోకు సంబంధించి ఆర్డర్ కాపీలను మంత్రి సీతక్కకు, పెద్దపల్లి ఆర్టీసీ డిపో సంబంధించి ఆర్డర్ కాపీలను మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే విజయరమణ రావుకు ఆర్డర్లు అందిస్తున్నట్లు చెప్పారు. రెండు నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు మూడు రాష్ట్రల సరిహద్దు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందుస్తు త్వరలోనే బస్సు డిపో నిర్మా ణాలు ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం జిల్లా కేంద్రం చేసిన అక్కడ బస్సు డిపో లేకపోవడంతో రవాణా శాఖ మంత్రిగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావు విజ్ఞప్తి మేరకు అక్కడ బస్సు డిపో మంజూరు చేశామని మంత్రి పొన్నం చెప్పారు.