యుద్ధంలో జోక్యం చేసుకోవాలా.. వద్దా..
నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాలు తీసుకుంటానన్న అమెరికా అధినేత
ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్ : ఇజ్రాయెల్-ఇరాన్ పోరులో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాల సమయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటిం చడాన్ని శ్వేతసౌధం శాంతి చర్చలకు మరో అవకాశంగా అభివర్ణిస్తోంది. కానీ ఇదే ప్రకటన అతనికి కొత్త సైనిక, గుప్త చర్యలకు మార్గం కానుంది. ఈ ప్రకట న ఒకవైపు ఇరానియన్లకు మళ్లీ శాంతికి మార్గం చూపుతున్నట్టు కనిపిస్తున్న ప్పటికీ మరోవైపు అమెరికా తన సైనిక ప్రణాళికలను బలపరుస్తున్నది. ఇజ్రాయెల్ విమాన దాడులు ఇరాన్ రెండు ప్రధాన యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రాల్లో ఒకదానిని, చాలా మిస్సైల్ నిల్వలను, అగ్రశ్రేణి సైనిక అధికారులను, అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టాయి. దీనివల్ల తెహ్రాన్ ధోరణిలో మార్పు వచ్చిందా లేదా అన్నది ట్రంప్ అంచనా వేసేందుకు ఈ రెండువారాల్లో సావకాశం దొరుకుతుంది.
ఇరాన్లో యురేనియం ఎన్రిచ్మెంట్ను నిషేధించి, అణ్వాయుధ నిర్మాణ మార్గాన్ని మూసివేయాలన్నది అగర్రాజ్యం నిర్ణయం కాగా ఈ నెల ప్రారంభంలో ఆయతొల్లా అలీ ఖొమైనీ తిరస్కరించిన ఒప్పందం అది. ఇప్పుడు ఒక ప్రధాన అణు కేంద్రం ధ్వంసమైన నేపథ్యంలో ట్రంప్ మరొకదానిపై ప్రపంచంలోనే పెద్ద తేలికపాటి బాంబును వదిలే ఆలోచన చేస్తుండటంతో ఆ ఒప్పందం మరింత విలువైనదిగా కనిపించొచ్చు. లేదా ఇది ఇరాన్ను మరింత దృఢంగా తీసుకునేలా చేసేదీ కావచ్చు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ఈ ప్రకటనను ఉపయోగించి ఇరానియన్లను మోసం చేయాలనుకున్న అవకాశం కూడా ఉంది. ‘ఇది వారి జాగ్రత్తను తగ్గించేందుకు ఒక నాటకంగా ఉండవచ్చు’ అని అమెరికా నౌకాదళానికి చెందిన రిటైర్డ్ అడ్మిరల్ జేమ్స్ స్టవ్రిడిస్ CNNకు చెప్పారు.
మోసపూరితంగా కాకపోయినా ట్రంప్ ఇరాన్కు మరో అవకాశం ఇస్తూ తన సైనిక ఎంపికల పరిమితిని విస్తరిస్తున్నారు. రెండు వారాలు అంటే మరో అమెరికన్ విమానదళ నౌక రంగంలోకి వచ్చే సమయం లభిస్తుంది. తద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే దాడుల నుంచి అమెరికా సైనికులను కాపాడే అవకాశాలు మెరుగుపడతాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఫోర్డో ఎన్రిచ్మెంట్ కేంద్రం వంటి గమ్యస్థానాల చుట్టూ ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తొలగించేందుకు మరింత సమయం దొరుకుతుంది. దీని వల్ల ట్రంప్ దాడికి నిర్ణయం తీసుకున్నా అమెరికన్ బలగాలపై ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కాలపట్టికను ఎదుర్కొనకుండా తన రీతిలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కూడా పొందుతున్నాడు. నెతన్యాహూ తమకు లేని ఆయుధాలతో ట్రంప్ను యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ప్రకటన వెలువడిన గంటలోపే నెతన్యాహూ ఫోర్డోలోని లోతైన అణు కేంద్రంపై స్వయంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తానని హెచ్చరించారు. ‘వాళ్ల అణు సదుపాయాలన్నింటినీ మేము లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేస్తామ‘న్నారు.
అమెరికా, విదేశీ నిపుణుల ప్రకారం, ఇజ్రాయెల్ కొంతకాలంగా ఈ విధమైన దాడులకు సన్నద్ధత తీసుకుంటోంది. ఎన్రిచ్మెంట్ హాలులో ఉన్న సెంట్రిఫ్యూజ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్న వ్యవస్థను బలహీనపర్చే పథకాలపై పరిశోధన చేస్తూ వచ్చింది. ఇది అత్యంత వేగంగా తిరిగే యంత్రాలను ధ్వంసం చేయగలదు. ఇటీవలి రోజుల్లో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) ప్రకారం, నతాంజ్లోని మరో ఎన్రిచ్మెంట్ కేంద్రం మీద ఉన్న విద్యుత్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయడం వల్ల వేలాది సెంట్రిఫ్యూజ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తేలింది. ‘అమెరికా సైన్యాన్ని అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలన్నది ట్రంప్ అభిమతం’ అని ఆయన మద్దతుదారుడు వాన్స్ తెలిపారు. కానీ ట్రంప్కు మద్దతు ఇచ్చే కొంతమంది ప్రముఖులు మాజీ రిపబ్లికన్ ఎంపీ మార్జోరీ టేలర్ గ్రీన్, మీడియా వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్, స్టీఫెన్ బన్నన్ మరో దేశ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని విమర్శించారు.
‘ఇజ్రాయెల్/ఇరాన్ యుద్ధంలో అమెరికా పూర్తిగా కలగజేయాలని కోరేవారు అమెరికా ఫస్ట్ లేదా MAGA సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నారుఏ అని గ్రీన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరోవైపు, ట్రంప్కు మద్దతుగా ఉన్న సెనేట్లోని యుద్ధానికి అనుకూలమైన నేతలు లిండ్సే గ్రాహామ్, టామ్ కాటన్ లాంటి రిపబ్లికన్లు ఇరాన్పై మరింత దూకుడుగా వ్యవహరించాలని కోరుతున్నారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్.. ఇజ్రాయెల్కు అణు ముప్పును నిర్మూలించడంలో పూర్తి సహాయాన్ని అందించండి’’ అని గ్రాహామ్ ఫాక్స్ న్యూస్లో అన్నారు. ‘‘బాంబులు అవసరమైతే అందించండి. విమానాల అవసరమైతే సంయుక్తంగా దాడులు చేయండి అని చెప్పారు.