గ్రామస్వరాజ్యం కోసం గాంధీ కలలను నిజం చేసాం
ఉద్యమ కలను సాకారం చేసిన కెసిఆర్
ఎక్స్లో పోస్ట్ చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్24: తన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమ నినాదాలను నిజం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్మాగాంధీ కన్న కలలను కూడా సాకారం చేశారని చెప్పారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పల్లె ప్రగతిని గుర్తుచేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో కేటీఆర్.. ’పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమేగాక గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్న కలలను కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. ఇవాళ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. పల్లెసీమలే దేశానికి పట్టు-గొమ్మలన్న మహాత్మా గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణం పోసిన ‘పల్లెప్రగతి’ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. సమైక్య పాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం.
అనితర సాధ్యం.’ అని పేర్కొన్నారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ప్రతి పల్లె నాడు సకల సౌకర్యాల హరివిలలైంది. కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారింది. ప్రతి పల్లెలో డంప్ యార్డు తప్ప.. చెత్త కంపు లేని స్థితి వచ్చింది. కూలిపోయే స్థితి ఉన్న ఖాలీ ఇండ్ల కిరికిరి నుంచి పొంగిపొర్లే మురికి కాలువల శుభ్రత వరకూ ప్రతి సమస్యకు పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం దొరికింది. కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింతలేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం గ్రామ స్వరాజ్యంలో ఓ స్వర్ణయుగం.’ అని కేటీఆర్ రాసుకొచ్చారు. పచ్చదనానికి కొదవ లేకుండా, నిధులకు కొరత లేకుండా, విధులకు ఆటంకం లేకుండా, ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది కేసీఆర్ విజనే. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి విజయం. నాడు పదేళ్లపాటు మురిసిన పల్లె, కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడితప్పింది.
ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లె ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవు.’ అని కేటీ-ఆర్ నేటి దుస్థితిని వివరించారు. చివరికి రాష్ట్రంలో పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. ఉపాధి హా కూలీలకు పనిదినాలు లేవు. మాజీ సర్పంచ్ల బిల్లులకే మోక్షం లేదు. దేశంలోనే ఆదర్శ గ్రామాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు అధ్వాన పరిస్థితులకు అడ్రస్గా మారడం అత్యంత బాధాకరం. దిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ పల్లె ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి జనం కర్రుకాల్చి వాతపెడుతరని హెచ్చరించారు.