స్నేహారెడ్డి కొనకటి
సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది.
తొలి నవలకి ప్రేరణ ఏమిటి?
లండన్ కి వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన డిఫరెంట్ బ్యాక్-గ్రౌండ్స్ ఉన్న చాలా మందిని కలిశాను. వాళ్ల కథలు , కష్టాలు , కలలు విన్నప్పుడు- ప్రతి ఒక్కరి జీవితంలో నేను చేయగలనా అనే ప్రశ్న ఉంటుందని అర్థమైంది. అలా ఒక మనిషి తన అభద్రతాభావాలని దాటి, తన కల కోసం కొత్త దేశానికి వెళ్లి తనని తాను వెతుక్కునే కథ రాయాలనిపించింది. అదే ఈ నవలకు ప్రేరణ.
ఈ నవల గురించి మీరు చెప్పదల్చుకున్నది?
ఈ నవల కలలు, భయాలు, కొత్త ప్రారంభాల గురించి. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సులభం కాదు. కొత్తచోటుకి వెళ్లడం, మన కంఫర్ట్ జోన్ వదిలేయడం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ ఈ కథలో ఉంటాయి. కానీ చివరికి ఈ కథ చెప్పేది ఒకటే- భయం ఉన్నా కూడా మన కలల కోసం ముందుకు వెళ్లాలి.
ఏం చదువుతున్నారు? ఇంకా ఏం రాస్తున్నారు?
ప్రస్తుతం సెల్ఫ్ గ్రోత్ , ఎమోషనల్ జర్నీస్ ఉన్న నవలలు ఎక్కువగా చదువుతున్నాను. అలాగే కొత్త కథల మీద కూడా పని చేస్తున్నాను. ఇంకా డ్రీమ్స్, రిలేషన్షిప్స్ , హ్యూమన్ ఎమోషన్స్ , గురించి మరిన్ని కథలు రాయాలని ఉంది.
(స్నేహారెడ్డి కొనకటి రాసిన తొలి నవల ‘1 మిలియన్ ఫాలోవర్స్’ 24/ 05/ 2026 తేదీన రామానాయుడు ప్రివ్యూ థియేటర్, హైదరాబాద్ లో ఆవిష్కరణ జరుగుతుంది)




అదే సముద్రం