సంస్కరణల పితామహుడు పీవీ

నివాళులర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను గుర్తు చేసుకున్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్‌ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page