హింస రాక్షస ప్రవృత్తి.. మానవతా వాదులెవరూ హింసను సమర్ధించారు ..! మంగళవారం శ్రీనగర్ పహల్గామ్ లో తీవ్రవాదులు పర్యాటకుల పై జరిపిన విచక్షణారహిత కాల్పులు రాక్షస ప్రవృత్తికి నిదర్శనం ..! 27 మంది పర్యాటక ప్రేమికులు ఈ దాడిలో మరణించడం…అనేక మంది గాయపడడం హృదయాన్ని ద్రవింపజేసే దుస్సంఘటన ..! ఈ దుర్ఘటన కేవలం ఓ ఉగ్రవాద దాడిగా కాదు, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, ఆర్ధికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావించవొచ్చు. పాకిస్థాన్ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పహల్గామ్ కేవలం ఓ పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా, అమర్నాథ్ యాత్ర మార్గంలో కీలకమైన బేస్ క్యాంపుగా నిలుస్తుంది. ఏడాది పొడవునా దేశీయ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం లక్షలాది ప్రజలకు జీవనోపాధిని కలిగిస్తుంది.
ఇటువంటి ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం వెనుక వ్యూహాత్మక లక్ష్యం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ లోయలో పర్యాటక అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి ..కానీ కొందరు స్థానికులు 370 రద్దు ను వ్యతిరేకంచారు . తమ ప్రాంతంలో దేశం లోని ఇతర ప్రాంతాల వారు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరపడం, ఆస్తులను కలిగి ఉండటం పట్ల వారికి అభ్యంతరాలున్నాయి. అందులోంచి ఏర్పాటు అయిన వేదికే ’ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ ..ఈ ఫ్రంట్ పహల్గాంలోని బైసరన్లో జరిగిన దాడి తమ పనే అని ప్రకటించుకుంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం.