మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుష్పుల్ రైలు ఢీకొని ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. మైనార్టీ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న ఎండీ గౌస్మియా మహబూబాద్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గౌస్మియా మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
—————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు