ఖర్గేను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

– త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

బెంగళూరు, అక్టోబర్‌ 7: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు. ఇటీవల పేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని, పూర్తి ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పార్టీకి, దేశానికి ఆయన మార్గదర్శకత్వం అత్యంత అవసరమన్నారు. ఖర్గేను కలిసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page