– ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్
– 21న విడుదల చేస్తామన్న విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్-జూన్ 2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో 10 సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,53,752 మంది దరఖాస్తు చేసుకోగా, 1,15,028 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 50,544 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైంది. పేపర్-1లో ఉత్తీర్ణత శాతం 65.29గా ఉండగా, పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్)లో 40.76 శాతం, పేపర్-2 (సోషల్ స్టడీస్)లో 25.79 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టీజీటెట్ నోటిఫికేషన్ను జూలై 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఇకపై ప్రతి సంవత్సరం మొత్తం నాలుగు టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో రెండు ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు, మరో రెండు సాధారణ అభ్యర్థులకు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టీజీటెట్ నోటిఫికేషన్ జూలై 21న విడుదల కానుంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సీబీటీ విధానంలో నిర్వహించబడతాయి. ఇకపై ప్రతి సంవత్సరం రెండు టెట్లు ఇన్సర్వీస్ టీచర్లకు, మరో రెండు సాధారణ అభ్యర్థులకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తంగా ఒకే ఏడాదిలో నాలుగు టెట్లు నిర్వహించనున్నారు..
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు