గతేడాది కన్నా పెద్ద ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా చూడండి
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల రిధాన్యం సేకరించామని ఆయన తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖాప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి కనీవిని ఎరగని రీతిలో ఈసారి 1.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వొచ్చే అంచనా ఉందన్నారు. ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాలకు ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. మరో 88 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని మంత్రి చెప్పారు.
గతేడాదితో పోల్చుకుంటే 15, మే 20224 లో జిల్లా మొత్తంలో 2, 109 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ. 5.65 కోట్లను రైతులకు చెల్లించామన్నారు. ఈసారి ఇప్పటికే 50,834 ధాన్యం సేకరించి రూ. 55.89 లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు. ధాన్యం ఎంత వొచ్చినా ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ముందెన్నడూ లేని రీతిలోపెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేశామని, యాసంగి ధాన్యం కొనుగోలకు 8,348 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2021-22 రబీ సీజన్ తో పోలిస్తే ఈ రబీ సీజన్ లో అధికంగా1,739 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరగడంతో కొనుగోలు కేంద్రాల పెంచుతున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు సాగుతాయని చెప్పారు. కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రానున్న 10,12 రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో లోపాలు గుర్తించి సత్వరమే పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రి సూచించారు. నిజానిజాలు ప్రజలకు బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.