యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





