– పెట్రోల్పై రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంపు
న్యూదిల్లీ, మే 25: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు తాజా ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్పై రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంచినట్లు వెల్లడించాయి. ఈ సవరించిన ధరలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పది రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి. వరుస ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ తాజా పెంపు మరింత భారంగా మారింది. పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటరుకు సుమారు రూ.8 వరకు పెరిగినట్లు అంచనా. తాజా పెంపుతో దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12, డీజిల్ రూ.95.20కు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.115.58, డీజిల్ రూ.103.74గా నమోదవగా, విజయవాడలో పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ రూ.104.88కు పెరిగింది. ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలని నిపుణులు పేర్కొంటున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై నెలకొన్న అనిశ్చితి కారణంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎగబాకుతున్నాయి. ఈ ప్రభావాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే భవిష్యత్తులో కూడా ఇంధన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



