సీఎం రేవంత్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు. శుక్రవారం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం అరుదైన గౌరవం ఆయనకు కల్పించిందని పేర్కొన్నారు. రోశయ్య సుమారు 50 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా వివాదరహితుడిగా పేరు పొందారని సిఎం అన్నారు. సమైక్య ఏపీకి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్ గా కూడా ఆయన సేవలందించారన్నారు.