ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తాం

బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలో హామీ

కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు గురించి వీరిద్దరూ చర్చించారు. ఈ ప్రాజెక్టును మంత్రిత్వశాఖ నిబంధనలకనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కిషన్‌ రెడ్డికి పాటిల్‌ తెలియజేశారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.అ న్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని పాటిల్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page