శక్తి మనదే…స్ఫూర్తి మనదే :

  • మహిళా శక్తికి తిరుగులేదన్న మంత్రి సీతక్క
  • ఘనంగా జరిగిన టీసిఇఐ – స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: మహిళలు తలచుకుంటే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka)  అన్నారు. తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఇవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసిఇఐ) ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక 7 ఎడిషన్ స్త్రీ శక్తి అవార్డ్స్‌ 2025 కార్యక్రమం సోమవారం మాధాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క స్త్రీ శక్తి అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి అవార్డులకు ఎంపికైన వారికి అవార్డులను బహుకరిస్తూ మంత్రి సత్కారం చేశారు. మహిళ సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ముఖ్యంగా ’ఇందిరా మహిళ శక్తి పథకం’ వంటి వాటి గురించి ప్రస్తావించారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు అన్ని విధాలుగా తాము ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.

ప్రత్యేక ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సృజనాత్మక పరిశ్రమలు శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ స్త్రీ శక్తి అవార్డ్స్‌ వంటి కార్యక్రమాలు మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడానికి దోహదపడతాయని చెప్పారు. సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) సీఈఓ దివ్య దేవరాజన్‌ మాట్లాడుతూ, గ్రామీణ మహిళా ఉద్దీపనకర్తల గుర్తింపులో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని అన్నారు. టీసీఇఐతో కలిసి సెర్ప్‌ ఆధ్వర్యంలో మహిళలకు ఈవెంట్‌ మేనేజర్లుగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్లు చెప్పారు.
టీసీఇఐ అధ్యక్షుడు బలరాం బాబు, స్త్రీ శక్తి అవార్డ్స్‌ కన్వీనర్‌ మిల్లెట్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకురాలు విశాలరెడ్డి మాట్లాడుతూ, స్టీ శక్తి వేదిక మరింత విస్తరిస్తోందని, భవిష్యత్‌లో మహిళల పాత్రను మరింత విస్త్రత పరిచేలా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని వివరించారు.
తెలంగాణ టూరిజంకు చెందిన ప్రకాశ్‌ రెడ్డి, టూరిజం శాఖ డైరెక్టర్, జడ్‌. హనుమంత్‌ కొండిబా, కింగ్‌డమ్‌ ఆఫ్‌ లెసోతో హానరరీ కాన్సుల్, సురత్‌ సింగ్‌ మల్హోత్రా, హెచ్‌వైఎస్‌ఇఎ అధ్యక్షుడు ప్రశాంత్‌ నదేంద్ల, ఫిక్కి చైర్‌పర్సన్, ప్రతిభా కుందా, యునైటెడ్‌ వే హైదరాబాద్‌ చైర్‌పర్సన్‌ బోర్డ్‌ మెంబర్‌ డాక్టర్‌ కిరణ్మయి పెమ్మసాని పెండ్యాల,ఫీనిక్స్‌ గ్రూప్, ఎవిపి డిజైన్‌ విభాగంకు చెందిన హర్షిత అట్లూరి, రైనా సోషల్‌ ఇనిషియేటివ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సంగీతా వర్మ లు కూడా హాజరయ్యారు.

4 విభాగాల్లో 50 మంది అవార్డు గ్రహీతలు వీరే…

అసాధారణ మహిళలకు అందించే స్ట్రీ శక్తి అవార్డ్స్‌ 2025 కోసం దేశవ్యాప్తంగా 250 మందికి పైగా మహిళలు దరఖాస్తు చేయగా 4 విభాగాల్లో 50 మంది మహిళలు ఎంపికయ్యారు: అత్యున్నత గౌరవమైన స్ట్రీ రత్న , స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి మరియు ప్రత్యేక ఎస్ హెచ్ జీ మహిళా విభాగం అవార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా 15 ఏళ్లకు పైగా హాస్పిటాలిటీ, సృజనాత్మక కళలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళా ప్రముఖులు రాజనీ నాయర్‌ డెబ్, మాలిని దివాకల, పుష్ప భాస్కర్, వాణి తమ్మయగారి, మాలిని ఎల్‌. నరసింహన్‌లకు స్త్రీరత్న అవార్డులకు ఎంపికయ్యారు.

టీసీఈఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రెసిడెంట్ బలరామ్ బాబు, రవి బూర, జనరల్ సెక్రటరీ, రామ్ ముప్పన, జాయింట్ సెక్రటరీ, తౌఫిక్ మహమ్మద్, ట్రెజరర్, వర్టికల్ అసోసియేషన్ అధ్యక్షులు, స్త్రీ శక్తి కో-కన్వీనర్‌లు ప్రభా చౌదరి, వందన రాజా, దీప్తి జై: సంజూ, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page