టెన్త్ ‌మెమోల్లో మార్కులతో పాటు గ్రేడింగ్‌

రెండు, మూడు రోజుల్లో ఫలితాల విడుదల
‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌పదో తరగతి మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి సర్కారు ఎట్టకేలకు తెరదించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పదో తరగతి మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ ‌యోగితారాణా తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.

పదో తరగతిలో ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్‌ ‌విధానాన్ని తీసేశారు. గ్రేడ్ల స్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటర్నల్స్‌ను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం ఆలస్యం కావడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్ ఉం‌టాయని ప్రకటించారు. మెమోలపై మార్కులు ఎలా ముద్రించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page